Wednesday 27 July 2011

kenramoi vothidi penchali:kothandaram

తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచాలని రాజకీయ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ నేతలను కోరారు. జెఎసి నేతలు ఈరోజు ఇక్కడికి వచ్చి పలువురు జాతీయ పార్టీ నేతలను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు మద్దతు కోరారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో జెఎసి నేతలు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ అందరూ కలిసి వత్తిడి పెంచితేనే కేంద్రం కదులుతుందన్నారు. రాజీనామా చేసినవారి వెంట తాము ఉంటాంమని వారికి భరోసా ఇచ్చారు. రాజీనామా చేయనివారి వెంటపడతామని హెచ్చరించారు.

No comments:

Post a Comment