Wednesday 27 July 2011

telangana kosam a parti thonaina kalustham:errabelli

ప్రత్యేక తెలంగాణ కోసం ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్ధమని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్దమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సాధిస్తే కాంగ్రెస్ ద్వారా వచ్చిందని చెబుతామని అన్నారు.

తెలంగాణ విషయమై ఇప్పటికే కమిటీలు వచ్చాయి, పోయాయని అన్నారు. ప్రణబ్‌ముఖక్జీ, శ్రీకృష్ణ కమిటీలు పోయాయని, ఇప్పుడు అజాద్ కమిటీ వచ్చిందని ఎర్రబెల్లి ఎద్దెవా చేశారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment